టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై కేసు నమోదు

13 Aug, 2020 10:59 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడి చేసేందుకు రాష్ట్రంలో కొన్ని ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనల అమలుతో పరిమిత సంఖ్యలో వివాహాలకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో మడకశిర నియోజకవర్గంలోని అమలాపురంలో టీడీపీ నేత కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న తన కూతురు వివాహాన్ని భారీ జన సందోహం మధ్య జరిపించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

 


 

మరిన్ని వార్తలు