ఏపీకి అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

14 Sep, 2021 14:11 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు కేంద్రం రుణ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏపీ సహా 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మూలధన వ్యయంలో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ 15 శాతం టార్గెట్‌ పూర్తి చేసింది. ఏపీకి రూ.2,655 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. జీఎస్‌డీపీలో నాలుగు శాతం నిక‌ర రుణాల ప‌రిమితిపై 0.50 శాతం కేంద్రం ప్రోత్సాహ‌కం ఇచ్చింది.

ఇవీ చదవండి:
ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్‌’
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: క్షమాపణ కోరిన అచ్చెన్నాయుడు

మరిన్ని వార్తలు