రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 1004 కోట్ల రివార్డు

6 Jan, 2021 12:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు కేంద్రం రివార్టును ప్రకటించింది. పౌర సేవల సంస్కరణల్లో నాలుగింట మూడు అమలు చేసినందుకుగాను రివార్డును అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‌, పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలను అమలు చేయడంలో ఏపీ ముందంజలో నిలిచింది. కాగా రివార్డులో భాగంగా కేంద్రం స్పెషల్‌ అసిస్టేన్స్‌ కింద ఈ రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 1004 కోట్ల రివార్డును అందించింది. ఇందులో ఏపీ వాటా 344 కోట్ల రూపాయలు ఉండగా.. మధ్యప్రదేశ్‌ వాటా 660 కోట్లు. 

మరిన్ని వార్తలు