కోర్టును సందర్శించనున్న పార్లమెంటరీ కమిటీ

22 Jun, 2022 09:14 IST|Sakshi

విశాఖ లీగల్‌: కేంద్ర పార్లమెంట్‌ వ్యక్తిగత, ప్రజా సమస్యల లా అండ్‌ జస్టిస్‌ కమిటీ ఈ నెల 23న నగరంలో పర్యటించనుంది. ఈ మేరకు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైద్యుల నవీంద్ర ప్రసాద్, సీనియర్‌ న్యాయవాది నాదెళ్ల వెంకటసుమన్‌ మంగళవారం కమిటీ సభ్యులను కలిశారు. కమిటీలో సునీల్‌కుమార్‌ మోదీ(బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి), కమిటీ చైర్మన్‌ కనకమేడల రవీంద్ర కుమార్‌లు ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ ఈ నెల 23న విశాఖ జిల్లా కోర్టును సందర్శిస్తారు. కోర్టులో మౌలిక సదుపాయాలు, భవనాలు, ఇరత అంశాలను పరిశీలించి పార్లమెంట్‌కి నివేదిక సమర్పిస్తారు.   

(చదవండి:  దర్జీ సంతసం)

మరిన్ని వార్తలు