వాడరేవు తీరంలో వింత మత్స్యం 

19 Feb, 2021 12:49 IST|Sakshi

చీరాలటౌన్‌: చీరాల వాడరేవు సముద్ర తీర ప్రాంతానికి గురువారం వింత చేప కొట్టుకువచ్చింది. తెల్లని రంగులో మూడు కళ్లుతో కేజీన్నర బరువు ఉన్న ఈ చేప రబ్బరులా సాగుతోంది. వాడరేవు సముద్ర తీరం ఒడ్డున వింత ఆకారంలో ఉన్న చేప కనిపించడంతో మత్స్యకారులు భయ్చాందోళన చెందారు.

గతంలో ఎన్నడూ ఇలాంటి ఆకారంతో వింతగా ఉన్న చేపలను తాము చూడలేదని తెలిపారు. కిలోన్నర బరువుతో వింతగా మూడు కళ్లుతో ఉన్న చేపను తిలకించేందుకు మత్స్యకారులతో పాటుగా చాలామంది తీరానికి చేరుకున్నారు. ఇలాంటి వింత చేపను తామెన్నడూ చూడలేదని చీరాల మత్య్సశాఖ అధికారి లక్ష్మానాయక్‌ తెలిపారు.

చదవండి:
ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి  
ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య

మరిన్ని వార్తలు