ఏపీ హైకోర్టులో 55 సివిల్‌ జడ్జి పోస్టులు

22 Jul, 2021 13:16 IST|Sakshi

అమరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 55
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(లా) ఉత్తీర్ణులవ్వాలి.

► వయసు: 01.07.2021 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

► జీతభత్యాలు: నెలకు  రూ.27,700 నుంచి రూ.44,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌(కంప్యూటర్‌ బేస్డ్‌), రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. 

పరీక్షా విధానం
► స్క్రీనింగ్‌ టెస్ట్‌: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనిలో 40శాతం, ఆపై మార్కులు సాధించిన వారిని 1:10 పద్ధతిలో రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. (ఎంబీబీఎస్‌తో.. కేంద్ర ప్రభుత్వ కొలువు)

► రాతపరీక్ష: ఇందులో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. 1. సివిల్‌ లా, 2. క్రిమినల్‌ లా, 3. ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్, ఎస్సే రైటింగ్‌ టెస్ట్‌ విభాగాలు ఉంటాయి. ప్రతి పేపర్‌ని 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌ పరీక్ష సమయం 3 గంటలు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని వైవా వాయిస్‌కు ఎంపికచేస్తారు. దీన్ని 50 మార్కులకు  నిర్వహిస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021

► స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది: 26.09.2021
► పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి,తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
►వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in

మరిన్ని వార్తలు