రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్‌

15 Aug, 2022 20:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందు (ఎట్‌హోమ్‌) కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. రాజ్‌భవన్‌ చేరుకున్న సీఎం జగన్‌ దంపతులకు గవర్నర్‌ దంపతులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు మంత్రులు, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు