Hyderabad: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

18 May, 2022 13:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కాటసాని కుమారుడు శివఓబుల్‌రెడ్డి వివాహం మేధాశ్రీతో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా, పెళ్లి కుమార్తె మేధాశ్రీ తండ్రి పెద్ది సాయిరెడ్డి హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త. ఈ వివాహ వేడుకకు ఏపీ, తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

చదవండి: (పార్లమెంటులో ఆరుగురు నెల్లూరు వాసులు)

మరిన్ని వార్తలు