వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్

24 Feb, 2021 04:30 IST|Sakshi
నూతన వధూవరులతో ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి: విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో మంగళవారం రాత్రి జరిగిన మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి – ప్రదీప్‌కుమార్‌రెడ్డి దంపతుల కుమారుడు సాయినవతేజ్‌ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులు సాయినవతేజ్‌ – మేఘన దంపతులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు