జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన కార్యక్రమం
క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
సాక్షి, అమరావతి : వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. పంట నష్టం అంచనాలను అక్టోబర్ 31లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. వర్షాలు, కోవిడ్, వార్డు సెక్రటేరిట్స్ తనిఖీలు, నాడు-నేడు తదితర అంశాలపై మంగళవారం ఆయన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
(చదవండి : రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్)
ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కలెక్టర్లు మానవతా ధృక్పదంతో పనిచేస్తూ.. కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వారికి సహాయం అందించాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అక్టోబర్ 31లోగా పంట నష్టానికి సంబంధించి అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలు కూడా 31లోగా పూర్తి చేయాలని సూచించారు. కరెంట్ పునరుద్ధరణను వేగంగా చేపట్టినందుకు కలెక్టర్లను సీఎం జగన్ అభినందించారు. ఈ నెల 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ ఇంకా ఎమన్నారంటే..
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్ ఇన్పుట్ సబ్సిడీని అదే సీజన్లో ఇస్తున్నాం.ఈ ఏడాది ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీని వైయస్సార్ రైతు భరోసా రెండో విడత చెల్లింపులతో పాటు ఇవ్వబోతున్నాం.జూన్, జూలై, ఆగస్టుతో పాటు, సెప్టెంబరు నెల ఇన్పుట్ సబ్సిడీని ఈనెల 27న ఇస్తున్నాం. ఖరీఫ్ పంటలకు సంబంధించి రూ.113 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి మరో రూ.32 కోట్లు. మొత్తం రూ.145 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు చెల్లించబోతున్నాం. అక్టోబరు నెలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీపై నవంబరు 15లోగా నివేదిక ఇవ్వాలి. అటవీ భూముల పట్టాలు (ఆర్ఓఎఫ్ఆర్) ఇచ్చిన గిరిజనులకు కూడా వైయస్సార్ రైతు భరోసా కింద ఈనెల 27న రూ.11,500 చొప్పున ఇవ్వబోతున్నాం.
(చదవండి : సీఎం జగన్ను కలిసిన దివ్య తల్లిదండ్రులు)
కరోనా పాజిటివిటి రేటు బాగా తగ్గింది
రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 70 వేల పరీక్షలు చేస్తున్నాము, మరోవైపు పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గింది. నిన్న (19వ తేదీ) పాజిటివిటీ రేటు 4.76 శాతం మాత్రమే. ఇదే గత వారంలో 5.5 శాతంగా నమోదైంది. ప్రతి 10 లక్షల మందిలో 1,33,474 మందికి వైద్య పరీక్షలు చేస్తూ, దే«శంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. రికవరీ రేటు 94.5 శాతం కూడా రాష్ట్రమే తొలి స్థానంలో ఉంది.
జాగ్రత్త పడాలి
కోవిడ్ తగ్గిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి సంబంధించిన సర్వే చూస్తే, కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా ఒక 10 శాతం కేసుల్లో మళ్లీ కొత్తగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కిడ్నీ, బ్రెయిన్, చెవుడు వంటి పలు సమస్యలు వస్తున్నాయి. కోవిడ్ తగ్గిన తర్వాత కూడా కనీసం 6 వారాల నుంచి 8 వారాల పాటు రోగులు జాగ్రత్తగా ఉండాలన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.వారికి ఓరియెంటేషన్ నిర్వహించాలి.పోస్టు కోవిడ్ అనారోగ్య సమస్యలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాము.
ఆ మేరకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశాము. 104 నంబరుపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. ఆ నెంబరుకు ఫోన్ చేస్తే 30 నిమిషాల్లో బెడ్ కేటాయించాలి.దాదాపు 200కు పైగా ఉన్న కోవిడ్ ఆస్పత్రుల్లో ఆహార నాణ్యత, శానిటేషన్, వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు ఎలా ఉంది?. ఈ 4 అంశాలపై కోవిడ్ ఆస్పత్రుల్లో డ్రైవ్ కంటిన్యూ కావాలి.
హెల్ప్ డెస్క్లు– సేవలు:
ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్లు ఉండేలా చూడాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్కులు ఉండాలి, వచ్చే 15 రోజుల్లో ఆ ఏర్పాట్లు జరిగి తీరాలి.ప్రతి హెల్ప్ డెస్క్ వెనక పోస్టర్ కూడా పూర్తి వివరాలతో ఉండాలి. ఆ డెస్కులో ఇద్దరు ఆరోగ్యమిత్రలు ఉండాలి. ఆ విధంగా రోజంతా ఆరోగ్యమిత్రలు సేవలందించాలి. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్కులను గమనించేలా సీసీ కెమెరాలు ఉండాలి, వాటిని జేసీలు పర్యవేక్షించాలి. ప్రతి ఆరోగ్య శ్రీ ఆస్పత్రి (ప్రభుత్వ, ప్రైవేటు)లో సీసీ కెమెరాలు ఉండి తీరాలి. ఆ హెల్ప్ డెస్కులలో కేవలం కూర్చోవడమే కాకుండా, ఆరోగ్యమిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్ఓపీ ఖరారు చేయండి. తను ఎందుకు కూర్చున్నాడు? తాను ఏం చేయాలి? తనపై సీసీ కెమెరా నిఘా ఎందుకు ఉంది? తాను రోగులకు ఏ రకంగా సహాయం చేయాలి? అన్న దానిపై ఆరోగ్యమిత్రలకు స్పష్టమైన అవగాహన ఉండాలి. రోగుల నుంచి కానీ, ఆస్పత్రి నుంచి కానీ ఆరోగ్యమిత్రలు లంచం ఆశించకుండా చూడాలి. ఎవరైనా లంచం అడిగితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఆ నెంబర్ను పోస్టర్ ద్వారా ప్రదర్శించాలి. మనం ఒక రోగిగా ఆస్పత్రికి వెళ్తే, ఏ సహాయ, సహకారాలు కోరుకుంటామో, అవన్నీ ఆరోగ్యమిత్రలు చేయాలి.
– ఆ మేరకు ఎస్ఓపీ ఖరారు చేయాలి. ప్రతి ఆరోగ్యమిత్ర ప్రతి రోజూ జిల్లా వైద్యాధికారికి 4 అంశాలపూ నివేదిక ఇవ్వాలి. ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, మందుల అందుబాటు. వైద్య సేవలపై ఆరోగ్యమిత్రలు రోజూ నివేదిక ఇవ్వాలి. ఆ విధంగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో సేవలందేలా చూడడం కలెక్టర్లు, జేసీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శి బాధ్యత.
స్పెషల్ డ్రైవ్:
రెండు రోజులకు ఒకసారి తరగతులు:
సీజనల్ వ్యాధులు:
జాతీయ ఉపాథి హామీ పనులు:
నాడు–నేడు
స్కూళ్లు:
అంగన్వాడీ కేంద్రాలు:
వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు
వైద్య కళాశాలలు:
గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీ:
ఒక ఉన్నత లక్ష్యంతో..:
సకాలంలో సేవలు
జగనన్న తోడు:
వైఎస్సార్ బీమా
ఇంధన శాఖ:
నాణ్యమైన విద్యుత్ కోసమే..:
అది రైతుల హక్కు:
చివరగా, వివిధ పథకాల అమలు తేదీలను ప్రస్తావించిన సీఎం శ్రీ వైయస్ జగన్, అన్నింటిలోనూ కలెక్టర్లు, జేసీలది కీలకపాత్ర అని పేర్కొన్నారు. ఆ దిశలో వారు ప్రతి కార్యక్రమం, పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.