అక్టోబర్‌ 26న రైతు భరోసా రెండో విడత: సీఎం జగన్‌

21 Oct, 2021 16:43 IST|Sakshi

స్పందనపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, తాడేపల్లి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకేల నిర్మాణాల ప్రగతి గురించి సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలపై కూడా ఈ సమీక్షలో సీఎం జగన్ చర్చించారు. ఖరీఫ్ అవసరాలు, రబీ సన్నద్ధతపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై సమీక్ష నిర్వహించారు.

ఉపాధిహామీ:
ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టండి
విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంజిల్లాల్లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ వినియోగంపై తగిన దృష్టిపెట్టండి
 కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నారు
వెంటనే సచివాలయాల భవనాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి
రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తిచేయాలి
కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు దృష్టిపెట్టాలి
వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌పైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

గ్రామాల్లో డిజిటిల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నాం
అవాతంరాలు లేకుండా ఇంటర్నెట్‌ను సరఫరాచేస్తాం
దీనివల్ల వర్క్‌హోం కాన్సెప్ట్‌ సాకారం అవుతుంది
డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలి
తొలివిడతలో భాగంగా 4314 లైబ్రరీలను నిర్మిస్తున్నాం
ఈ లైబ్రరీల నిర్మాణానికి సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకోండి
అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది

పంట కొనుగోలు జరగాలంటే ఇ– క్రాపింగ్‌చేయాలి
ఇ– క్రాపింగ్‌ చేయించడమన్నది ఆర్బీకేల ప్రాథమిక విధి
ఇ– క్రాపింగ్‌పైన కలెక్టర్లు, జాయంట్‌ కలెక్టర్లు దృష్టిపెట్టాలి
యాప్‌ పైనకూడా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి
ఎక్కడ రైతులకు ధరల విషయంలో నిరాశజనక పరిస్థితులు ఉన్నా.. సీఎం యాప్‌ద్వారా... పర్యవేక్షణ చేసి వెంటనే రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలి
ఇ– క్రాపింగ్‌చేసిన తర్వాత డిజిటల్‌ రశీదుతోపాటు, భౌతికంగా కూడా రశీదు ఇస్తున్నారా? లేదా?చూడాలి
గ్రామంలోని ప్రతి ఎకరా కూడా ఇ–క్రాపింగ్‌జరగాల్సిందే
ఇ– క్రాపింగ్‌ఉంటనే పంటలబీమా, సున్నావడ్డీ, పంటకొనుగోళ్లు, ఇన్‌పుట్‌సబ్పిడీ ... ఇవన్నీకూడా సవ్యంగా జరుగుతాయి

అగ్రికల్చర్‌ అడ్వైయిజరీ మీటింగ్స్‌ కచ్చితంగా జరిగేలా చూడాలి
నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల స్థాయిలో, రెండో శుక్రవారం మండలస్థాయిలో, మూడో శుక్రవారం జిల్లాల స్థాయిలో అడ్వైయిజరీ సమావేశాలు జరగాలి
నాలుగో శుక్రవారం వ్యవసాయశాఖకార్యదర్శి సమక్షంలో రాష్ట్రస్థాయిలో సమావేశం జరగాలి:
ఈ సమావేశాల్లో వచ్చే సలహాలు, సూచనలు కొనసాగాలి

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నాణ్యమైన వాటిని ఆర్బీకేల ద్వారా పంపిణీచేయాలి
నెల్లూరులో జరిగిన ఘటన నాదృష్టికి వచ్చింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం
ఎంప్యానెల్‌ అయిన కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులనే ఇవ్వాలి
సీడ్‌కార్పొరేషన్‌.. ఈ ఉత్పత్తులను సమగ్రంగా పరిశీలించాలి
ఆర్బీకేల ద్వారా ఇస్తున్నవాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దు
కలెక్టర్లు నుంచి అందరూ కూడా సమిష్టిగా బాధ్యత వహించాలి
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఉంచడానికి ఆర్బీకేల్లోనే గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నాం
అప్పటివరకూ స్టోరేజీకోసం... అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకోండి
నాకు పలానాది కావాలని రైతులు అడిగితే.. కచ్చితంగా సంబంధిత ఆర్బీకే ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సరఫరా కావాలి
అందుకనే వీలైనంత త్వరగా ఆర్బీకేలను పూర్తిచేయాలి
అంతవరకూ తాత్కాలిక ఏర్పాట్లు పూర్తిచేసుకోండి
ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను ఉంచమని చెప్పాం
వారి విధులు, కార్యకలాపాలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి
అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఉండేలా చర్యలు తీసుకోండి

కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చాం
వారికి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి
వారికి రైతు భరోసా సహా.. అన్నిరకాలుగా అండగా ఉంటున్నాం
ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తున్నాం, బీమా ఇస్తున్నాం, పంట కొనుగోలుకు కూడా భరోసా ఇస్తున్నాం
ఇలాంటి సందర్భాల్లో వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనకడుగు వేయాల్సిన పనిలేదు:
అందుకే వారికి రుణాలు అందేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలి
నవంబర్‌ నుంచి రబీ పనులు ఊపందుకుంటాయి
రబీకి అవసరమైన విధంగా అధికారులు సన్నద్ధంకావాలి

62శాతం మంది ప్రజలు పరోక్షంగా, ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంపైన ఆధారపడి ఉన్నారు:
ఈ రంగం ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు:
దీన్ని ప్రతిక్షణం మీరు మనసులో పెట్టుకోవాలి
గ్రామీణఆర్థిక వ్యవస్థదీనిమీదే ఆధారపడి ఉంది

జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం విప్లవాత్మకమైనది
100 సంవత్సరాల క్రితం సర్వే అయ్యింది
100 ఏళ్ల తర్వాత సర్వే, రికార్డులను అప్‌డేట్‌ చేస్తున్నాం
గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్‌పడుతుంది
గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు ఉంటుంది
పైలట్‌ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో జరుగుతోంది
మరో 650 గ్రామాల్లో డిసెంబర్‌కల్లా పూర్తవుతుంది
 2023 జూన్‌కల్లా మొత్తం సర్వే ప్రక్రియ ముగుస్తుంది
కలెక్టర్లు, జాయింట్‌కలెక్టర్లు అంకిత భావంతో దీన్ని అమలు చేయాలి
సర్వే అవగానే రికార్డులు అప్‌డేట్‌ అవుతాయి, కొత్త పాసుపుస్తకాలు యజమానులకు ఇస్తాం

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సీఎం సమీక్ష
ఈ పథకం వల్ల లక్షలమందికి ఉపయోగం
47.4 లక్షల మంది లబ్ధి పొందుతారు 
పట్టాలు వీరిచేతికి అందుతాయి
వారి ఇంటి స్థలంమీద వారికి అన్నిరకాల హక్కులు వస్తాయి
దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి
ఈ పథకంమీద క్రమం తప్పకుండా సీఎస్‌గారు కూడా రివ్యూ చేస్తారు
డిసెంబర్‌ 21న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది

గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు బాగా మెరుగుపడ్డాయి
తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్‌ పరిశీలన తప్పనిసరి
తనిఖీలకు వెళ్లినప్పుడు గతంలో వ్యక్తంచేసిన సమస్యలను పరిష్కరించామా? వాటిని సరిచేశామా? లేదా?చూడాలి
రిజిస్టర్‌లోపేర్కొన్న అంశాలను సచివాలయాల విభాగాధిపతికి పంపించాలి
అలాగే ఏదైనా పరిష్కరించాల్సిన కొత్త అంశాన్ని గుర్తిస్తే.. వాటిని కూడా రిజస్టర్‌లో నమోదు చేయాలి
గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీచేసినప్పుడు గుర్తించిన అంశాలు, సమస్యలను పరిష్కరిస్తున్నారా? లేదా?వాటిపై దృష్టిపెడుతున్నారా? లేదా? అన్నదానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
దీనికి సంబంధించిన ప్రోటోకాల్‌ను తయారుచేయాలి
ఆ ప్రోటోకాల్‌ను పాటిస్తున్నారా? లేదా?కచ్చితంగా చూడాలి

దాదాపు 80శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనపరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందని చెప్తున్నారు
మిగిలిన 20 శాతం మంది సచివాలయాల సిబ్బందికి కూడా వారు పనితీరును మెరుగుపరిచేలా మనం వారికి తోడ్పాటును అందించాలి
నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాలు పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూతను, తోడ్పాటును అందించాలి

వాలంటీర్ల సేవలపైనా కూడా దృష్టిపెట్టాలి
వారు మెరుగైన సేవలు అందించేలా వారికి కౌన్సెలింగ్‌ చేయాలి
వారు అప్‌గ్రేడ్‌ అయ్యేలా చూడాలి
అందుకు వారికి చేయూతనిచ్చి.. తీర్చిదిద్దాలి
అప్పటికీ కూడా సేవలను అందించడంలో వారు ప్రమాణాలను అందుకునే రీతిలో లేకపోతే  వారిని తొలగించి కొత్తవారిని పెట్టాలి
ఖాళీగా ఉన్న వాలంటీర్‌ పోస్టులను కూడా భర్తీచేయాలి

అలాగే సచివాలయాలకు అందుతున్న విజ్ఞాపనలు, వినతుల పరిష్కారంపైకూడా దృష్టిపెట్టండి
రిడ్రెసల్‌ యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలి
సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం అక్టోబరు 29, 30 తేదీల్లో చేపట్టాలి
సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. బృందాలుగా ఏర్పడి వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలి
గతలో జరిగిన అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో కొన్నిచోట్ల కేవలం వాలంటీర్లు మాత్రమే కలిసినట్టు నా దృష్టికి వచ్చింది
కచ్చితంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల బృందాలుగా ఏర్పడి... కుటుంబాలను కచ్చితంగా కలవాలి
నెలలో ప్రతి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలి
ఇందులో సిబ్బంది, వాలంటీర్లు  ఈ సమావేశాల్లో పాల్గొనాలి
సచివాలయాల్లోని మౌలిక సదుపాయాలు, పరికరాలు కచ్చితంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి
మొబైల్స్, గౌరవవేతనం, సీఎఫ్‌ఎంస్‌ ఐడీలు, సిమ్‌కార్డులు, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలి
నెలలో రెండో బుధవారం  మండలం లేదా యూఎల్‌బీ స్థాయిలో సమావేశం జరగాలి
నెలలో మూడో బుధవారం జిల్లా స్థాయిలోసమావేశం కావాలి
నాలుగో బుధవారం రాష్ట్ర స్థాయిలో సచివాలయాల విభాగానికి చెందిన కార్యదర్శి సమావేశం కావాలి
ప్రతి ఏటా రెండు సార్లు జూన్, డిసెంబరుల్లో పెన్షన్లు, రేషన్‌కార్డులు, పట్టాలు తదితర పథకాలకు సంబంధించి మంజూరు ఉంటుంది
దీన్ని కచ్చితంగా అమలు చేయాలి

అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత:
2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు
ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి చర్యలు తీసుకోండి
నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలి
10 రోజుల ఆసరా కార్యక్రమాలను నిర్వహించిన కలెక్టర్లు, అధికారులందరికీ అభినందనలు

మరిన్ని వార్తలు