అర గంటలో బెడ్‌

29 Jul, 2020 02:58 IST|Sakshi

కోవిడ్‌ పేషెంట్‌కు ఆస్పత్రిలో బెడ్‌ దొరకలేదనే మాట రాకూడదు

‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

బెడ్‌ దొరకలేదంటే మానవత్వం మీద మాట వస్తుంది.. కలెక్టర్, జేసీలదే బాధ్యత 

ఆస్పత్రులేవీ వైద్యం నిరాకరించకూడదు

కోవిడ్‌ నివారణకు డబ్బు విషయంలో రాజీవద్దు

ఇబ్బందులను మీ వరకు రానివ్వను.. నేను పడతా

కోవిడ్‌ ఆస్పత్రుల్లో బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలివ్వాలి

సదుపాయాలు, చికిత్సపై ఫిర్యాదులకు ఆస్పత్రుల వద్ద 1902 నంబర్‌

దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు 

బంధువులకు అంత్యక్రియలు చేయకపోవడం విచారకరం.. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుంది

మరణాల రేటును 1.06 శాతానికి పరిమితం చేయగలిగాం.. ఇదొక విజయం

సగం మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు
► కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఇప్పుడున్నాయి. పాజిటివ్‌ కేసులు గుర్తించిన తర్వాత డేటాను విశ్లేషించుకుని ముందడుగులు వేయాల్సి ఉంది. కోవిడ్‌ అన్నది వస్తుంది.. పోతుంది కూడా.. వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి.

► మన దగ్గర లక్షకుపైగా కేసులు నమోదైతే అందులో సగం మందికి పైగా నయం అయిపోయి ఇళ్లకు వెళ్లిపోయారు. నమోదవుతున్న కేసుల్లో 85 శాతం మందికి ఇళ్లలోనే నయం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. దేశ వ్యాప్తంగా మరణాల రేటు దాదాపు 2.5 శాతం ఉంటే మన దగ్గర రూ.1.06 శాతం ఉంది. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యమైంది.

► పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా మన దగ్గర అత్యాధునిక ఆసుపత్రులు లేకపోయినప్పటికీ మరణాల రేటును బాగా తగ్గించగలిగాం. ఇది మనం సాధించిన విజయంగా చెప్పొచ్చు. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి.

కోవిడ్‌ కారణంగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు రూ.15 వేలు ఇవ్వాలి. బంధువులెవరూ రాకపోతే.. ప్రభుత్వమే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. కోవిడ్‌ అంటే భయాందోళనలు పోవాలి. అవగాహన పెంచుకుని, ధైర్యంగా ఎదుర్కోవాలి. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి గట్టి సంకేతం పోవాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : కోవిడ్‌–19 పేషెంట్‌కు 30 నిమిషాల్లోగా బెడ్డు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎవరైనా పేషెంట్‌ వస్తే రాష్ట్రంలోని 138 కోవిడ్‌ ఆసుపత్రుల్లో బెడ్‌ దొరకలేదనే మాట ఎక్కడా రాకూడదన్నారు. ఇందుకు కలెక్టర్, జేసీలను తప్పనిసరిగా బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. ఇలా జరిగితే మానవత్వం మీద మాట వస్తుందని, వైద్యులు మానవత్వం చూపించాలని కోరారు. ఏ ఆసుపత్రి కూడా వైద్యం నిరాకరించే ధోరణిలో ఉండకూడదని, అలా ఉంటే కఠిన చర్యలు తప్పవన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, జేసీలు, పోలీసు అధికారులతో రాష్ట్రంలో కోవిడ్‌ నివారణా చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.

కేసులు తగ్గించే ప్రయత్నం చేయడం 
► కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నప్పుడు సహజంగానే భయపడతారు. కేసుల సంఖ్య తగ్గించి చూపే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుత్వం ఎక్కడా అలాంటి వాటికి తావు ఇవ్వలేదు. కోవిడ్‌ పరిస్థితులు తలెత్తినప్పటి నుంచి కూడా శరవేగంతో పని చేశాం. 
► వైరస్‌ను నిర్ధారించడానికి అత్యంత వేగంతో ల్యాబులను ఏర్పాటు చేసుకున్నాం. రికార్డు స్థాయిలో రోజుకు 50 వేలకు పైగా టెస్టులు చేస్తున్నాం. దేశంలోనే ఇది అత్యధికం. ప్రతి 10 లక్షల మంది జనాభాలో 31 వేల మందికిపైగా టెస్టులు చేస్తున్నారు. ఈ టెస్టులు కూడా వైరస్‌ వ్యాప్తి ఉన్న క్లస్టర్లలో చేస్తున్నాం. 
► పాజిటివ్‌ కేసులను వీలైనంత త్వరగా గుర్తించడం, వారి కాంటాక్టులను ట్రేస్‌ చేయడం, పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. కింది నుంచి పై వరకు అధికారులు బాగా చేశారు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయగలిగాం.
► కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నప్పుడు సహజంగానే భయపడతారు. కేసుల సంఖ్య తగ్గించి చూపే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుత్వం ఎక్కడా అలాంటి వాటికి తావు ఇవ్వలేదు. కోవిడ్‌ పరిస్థితులు తలెత్తినప్పటి నుంచి కూడా శరవేగంతో పని చేశాం. 
► వైరస్‌ను నిర్ధారించడానికి అత్యంత వేగంతో ల్యాబులను ఏర్పాటు చేసుకున్నాం. రికార్డు స్థాయిలో రోజుకు 50 వేలకు పైగా టెస్టులు చేస్తున్నాం. దేశంలోనే ఇది అత్యధికం. ప్రతి 10 లక్షల మంది జనాభాలో 31 వేల మందికిపైగా టెస్టులు చేస్తున్నారు. ఈ టెస్టులు కూడా వైరస్‌ వ్యాప్తి ఉన్న క్లస్టర్లలో చేస్తున్నాం. 
► పాజిటివ్‌ కేసులను వీలైనంత త్వరగా గుర్తించడం, వారి కాంటాక్టులను ట్రేస్‌ చేయడం, పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. కింది నుంచి పై వరకు అధికారులు బాగా చేశారు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయగలిగాం.
స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంపు కార్యాలయంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి, సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, ఉన్నతాధికారులు 

ప్రజల్లో భయాందోళనలను తగ్గించాలి
► ప్రజల్లో తీవ్ర భయాందోళనలు తగ్గించే దిశగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి. కోవిడ్‌  పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి? అనే వివరాలు తెలియని మనిషి రాష్ట్రంలో ఉండకూడదు. 
► ఇందుకు ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో నంబర్లతో కూడిన పోస్టర్లు ఉంచాలి. కోవిడ్‌ వైద్య సహాయం కోసం 104, 14410 కాల్‌ సెంటర్‌ నంబర్లు ఇప్పటికే పని చేస్తున్నాయి. దీనికి తోడు జిల్లాల్లోని కోవిడ్‌ కంట్రోల్‌ రూం కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా ఉంది.  

‘పేషెంట్‌ కోవిడ్‌ కేర్‌ ఆస్పత్రికి వెళితే బెడ్‌ లేదు అనే మాట ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఎవరైనా షేషంట్‌ నాకు బెడ్‌ దొరకలేదు అంటే అది మన మానవత్వం మీద ప్రశ్నే అవుతుంది’  
– ట్విట్టర్‌లో సీఎం వైఎస్‌ జగన్‌

ఆరోగ్య పరిస్థితులను బట్టి నిర్ణయం
► కోవిడ్‌ పాజిటివ్‌ కేసును గుర్తించిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి హోం క్వారంటైన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి, రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రుల్లో అవసరమైన దానికి పంపించాలి. ఇంట్లో ప్రత్యేక గది లేని పక్షంలో వారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించాలి. 
► హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తిని పూర్తిగా పర్యవేక్షించాలి. డాక్టర్‌ తప్పనిసరిగా విజిట్‌ చేయాలి. వారికి మందులు అందుతున్నాయా? లేదా? చూడాలి. క్రమం తప్పకుండా వారి ఆరోగ్య వివరాలను కాల్‌ చేసి కనుక్కోవాలి.  
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో డాక్టర్లను అందుబాటులో ఉంచాలి. పారిశుధ్యం, ఆహారంపై తప్పకుండా ధ్యాస పెట్టాలి. నాణ్యమైన మందులు ఇస్తున్నారా? లేదా? చూడాలి. క్రమం తప్పకుండా డాక్టర్లు వెళ్తున్నారా? లేదా? చూడాలి.
► రాష్ట్ర స్థాయి ఆసుపత్రుల్లో 8 వేల బెడ్లు ఉన్నాయి. వీటిని క్రిటికల్‌ కేర్‌ కోసం వినియోగించాలి. కోవిడ్‌ లక్షణాలు తక్కువగా ఉన్న వారిని క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రులకు పంపి ఉపయోగం లేదు. బెడ్లను సమర్థవంతగా వినియోగించుకునే వ్యవస్థ ఉండాలి.  

కోవిడ్‌ సోకిన వారికి చికిత్స కోసం ఉన్న 128 జిల్లా ఆస్పత్రులు, 10 రాష్ట్ర స్థాయి ఆసుపత్రుల్లో బెడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు డిస్‌ ప్లే చేయాలి. పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలి. ఇక్కడ సదుపాయాలను తప్పనిసరిగా పర్యవేక్షించాలి. 30 నిమిషాల్లో పేషెంట్‌ అడ్మిషన్‌ జరగాలి. పేషెంట్‌ ఏ ఆస్పత్రికి వచ్చినా సరే, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎక్కడకు పంపాలన్నది డాక్టర్‌ నిర్ణయించాలి.  
– సీఎం జగన్

ఖర్చుకు వెనుకాడొద్దు
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రులు, రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆసుపత్రుల వద్ద చికిత్స, సదుపాయాలు, పారిశుధ్యం, భోజనం తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రతి చోట పెద్ద అక్షరాలతో 1902 నంబర్‌ను డిస్‌ప్లే చేయాలి. 
► ఆసుపత్రిలో సదుపాయాలు బాగోలేదని ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించాలి. కోవిడ్‌ నివారణ చర్యల గురించి ఖర్చు విషయంలో రాజీ పడొద్దు. ఇబ్బందులున్నా.. నేను పడతా.. మీ వరకు రానివ్వను. 
► వచ్చే 6 నెలల పాటు 17 వేల మంది డాక్టర్లు, సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతి ఇచ్చాం. వచ్చే వారం రోజుల్లో కొరత లేకుండా వీరిని నియమించుకోవాలి. 15 రోజుల్లో ఆక్సిజన్‌ బెడ్స్‌ను పెంచాలి.
► రాష్ట్ర స్థాయిలోని 10 క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు, జీజీహెచ్‌ ఆసుపత్రుల్లో రెమిడెసివర్‌.. లాంటి ఖరీదైన మందులను అందుబాటులో ఉంచాలి. పేషెంట్‌కు రూ.30 వేలు–35వేలు ఖర్చు అవుతున్నా అందుబాటులోకి తీసుకొస్తున్నాం.

సీజనల్‌ వ్యాధులపై దృష్టి
► వర్షాకాలం ప్రారంభం అయ్యింది. సీజనల్‌ వ్యాధులు వస్తాయి. డయేరియా, డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా లాంటి జ్వరాల పట్ల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. 
► కంట్రోల్‌ రూమ్స్‌కు కేవలం కోవిడ్‌ కోసమే కాకుండా... ఇతర ఆరోగ్య సమస్యల గురించి ఎవరైనా కాల్‌చేస్తే వెంటనే చర్యలు తీసుకునేలా ఉండాలి. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. పారిశుధ్యాన్ని మెరుగ్గా నిర్వహించాలి. ఇది చాలా ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం.

కొన్ని రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో బెడ్లు అమ్ముకుంటున్నట్లు వార్తా చానళ్లలో చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రాకూడదు. మానవత్వంతో ఈ సమస్యలను పరిష్కరించాలి. బలమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. 

కోవిడ్‌ కారణంగా మరణించిన వారి విషయంలో మానవత్వం కనుమరుగవుతోంది. కోవిడ్‌ రావడమన్నది పాపం కాదు.. నేరం కాదు. కోవిడ్‌ కారణంగా ఎవరైనా చనిపోతే.. వారి నుంచి కోవిడ్‌ వ్యాపించకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటారు. చనిపోయిన వారిలో కొన్ని గంటల తర్వాత వైరస్‌ ఉండదు. అయినా సరే సొంత బంధువులకూ అంత్యక్రియలు నిర్వర్తించక పోవడం విచారకరం.

మరిన్ని వార్తలు