వీరేశలింగం పంతులు జయంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌

16 Apr, 2023 13:20 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు’’ అని సీఎం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘‘సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.
చదవండి: రామోజీ ఓ విషసర్పం.. తోడల్లుడు డాల్ఫిన్‌ అప్పారావు సంచలన వ్యాఖ్యలు
 

మరిన్ని వార్తలు