వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

19 Oct, 2020 16:01 IST|Sakshi

సాక్షి, అమరావతి : వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం పరిశీలించారు. సీఎం వెంట హోమ్ మంత్రి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షాలు, వరదలపై అధికారులు, మంత్రులతో సమీక్షజరిపిన విషయం తెలిసిందే. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ సైతం రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరా కిందవెంటనే రూ.2250 కోట్లు సాయం అందించాల్సిందిగా సీఎం జగన్‌ కేంద్రాన్ని కోరారు. (అవినీతి లేకుండా పారదర్శక విధానం: సీఎం జగన్‌)

వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పలు అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముందచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని అమిత్‌ షా దృష్టికి తీసుకుపోయారు. (హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్‌ లేఖ‌)

మరిన్ని వార్తలు