మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

28 Nov, 2020 14:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: నివర్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు.‌ శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వచ్చారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఎం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి.


ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్న సీఎం జగన్‌
నివర్‌ తుపాన్‌ ఏరియల్‌ సర్వే అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో భేటీ అయ్యారు. తుఫాన్‌ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చిస్తున్నారు.  వివిధ శాఖల అధికారులు నివేదికలతో సహా సమావేశానికి హాజరు అయ్యారు. ఈ భేటీలో వరద నష్టాలను ప్రజాప్రతినిధులు సీఎం జగన్‌ దృష్టికి తేనున్నారు. 
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు