ఏపీకి చేరుకున్న సీఎం జగన్‌

3 Jul, 2022 10:22 IST|Sakshi

సాక్షి, అమరావతి:ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి జోగి రమేష్‌, సీఎస్‌ తదితరులు స్వాగతం పలికారు.

గత నెల 28వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ పారిస్‌కు బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ తన కుమార్తె హర్ష  గ్రాడ్యుయేషన్‌ కాన్వొకేషన్‌ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. తిరిగి నిన్న సాయంత్రం(జూలై) 2న సాయంత్రం 4 గంటలకు పారిస్‌లో బయలుదేరి ఈరోజు(ఆదివారం) ఉదయం గన్నవరం చేరుకున్నారు.

ఇక్కడ చదవండి:  CM Jagan Tweet: డియర్‌ హర్ష.. గర్వంగా ఉంది

మరిన్ని వార్తలు