CM YS Jagan Birthday: డిసెంబర్‌ 21న ‘సచివాలయ’ దినోత్సవం

20 Dec, 2021 16:26 IST|Sakshi

సీఎం జగన్‌ వల్లే ఒకేసారి లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు

కృతజ్ఞతగా ఆయన పుట్టినరోజున ఉత్సవాలు.. ఉద్యోగులంతా పాల్గొనాలి  

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పిలుపు   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతగా.. ఆయన పుట్టినరోజైన డిసెంబర్‌ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతేడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, ఈసారి మరింత ఉత్సాహంతో వేడుకలు నిర్వహించాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.  
(చదవండి: అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు)

సచివాలయాల సిబ్బంది అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులెవ్వరూ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. కొత్త పీఆర్సీ కూడా వర్తిస్తుందని అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. 
(చదవండి: పరిశ్రమల ఖిల్లా ఆ జిల్లా.. రెండున్నర ఏళ్లలో ఆరు వేల ఉద్యోగాలు)

గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ వ్యవస్థను సృష్టించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఇస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు ఉద్యోగులు రుణపడి ఉంటారన్నారు.

చదవండి: AP: అప్రమత్తతే ఆయుధం: సీఎం జగన్

మరిన్ని వార్తలు