మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సీఎం జగన్‌ పరామర్శ

4 Jun, 2022 19:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ , అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. అస్వస్థతతో బాధపడుతున్న మంత్రికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స చేసి యాంజియోప్లాస్టి చేశారు.
చదవండి: ‘అమరావతి.. చంద్రబాబు బినామీ రాజధాని’

మరిన్ని వార్తలు