నటి జమున మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

27 Jan, 2023 10:29 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సీనియర్‌ నటి జమున(86) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని స్వగృహంలోనే శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.  ఆమె మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఇక, సినీ నటి, మాజీ ఎంపీ జమున మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతితో తెలుగు చిత్రసీమలో స్వర్ణ యుగానికి తెరపడినట్లు అయ్యిందన్నారు. జమున కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్‌ జగన్‌  ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మరిన్ని వార్తలు