ఎమ్మెల్యే దొరబాబుకు సీఎం జగన్‌ పరామర్శ

5 Sep, 2020 18:30 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఫోన్‌లో పరామర్శించారు. ఎమ్మెల్యే దొరబాబు కరోనా బారినపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి ధైర్యంగా ఉండాలని దొరబాబుకు భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. కాగా వైఎస్సార్‌ సీపీకి చెందిన పలువురు నేతలు కరోనా బారినపడి కోలుకున్నారు.

మరిన్ని వార్తలు