గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: సీఎం జగన్‌

4 Sep, 2021 21:58 IST|Sakshi

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో  ఉపాధ్యాయుల కృషి గొప్పది అని కొనియాడారు.

‘‘చదువే తరగని ఆస్తి.. గురువే రూపశిల్పి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్‌ డే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి:
సీఎం వైఎస్‌ జగన్‌కు అర్చక సమాఖ్య కృతజ్ఞతలు 
విద్యార్థి మృతిపై లోకేశ్‌ తప్పుడు ప్రచారం

మరిన్ని వార్తలు