విమర్శలకు ఆస్కారం ఇవ్వొద్దు

14 Dec, 2022 06:16 IST|Sakshi

మంత్రులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

దుష్టచతుష్టయం దుష్ఫ్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ ప్రభావవంతంగా నిర్వహించాలి

మీ నియోజకవర్గాలు, జిల్లాతో పాటు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న జిల్లాల్లోనూ పర్యవేక్షించాలి

21న ట్యాబ్‌ల పంపిణీ, జనవరి 1న పెంచిన పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలి

సాక్షి, అమరావతి: విమర్శలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. లేని అవినీతిని ఉన్నట్లుగా సృష్టిస్తూ ఎల్లో మీడియా వికృతరాతలు రాస్తూ దుష్ఫ్ర­చారం చేస్తోందంటూ ఆక్షేపిం­చారు. మంగళవారం తాత్కాలిక సచివాల­యంలో మంత్రివర్గ సమా­వేశం అనంతరం సమకా­లీన రాజకీయ పరి­ణా­మాలపై ఆయన మంత్రులతో చర్చించారు.

రాష్ట్రం­లో అత్యంత పారదర్శకమైన పారిశ్రామిక విధా­నాలను అను­సరిస్తుండటం వల్లే అత్యంత ప్రతి­ష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నా­య­న్నారు. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను అత్యంత పారదర్శకంగా చేపడు­తున్నామని.. కానీ సన్నిహితులకే ఎనర్జీ ప్రాజెక్టు­లను కట్టబెడుతున్నట్లు ఎల్లో మీడియా వికృత ప్రచా­రం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోకి పెట్టుబ­డులు రాకుండా అడ్డుకోవడానికే ఇలా దుష్ఫ్ర­­చారం చేస్తున్నార­న్నారు.

వాస్తవాలను ప్రజ­లకు వివరించి.. దుష్టచ­తుష్టయం దుష్ఫ్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొ­ట్టా­లని మార్గ నిర్దేశం చేశారు. ఎల్లో మీడియా వికృత చేష్టల నేపథ్యంలో మరింత అప్ర­మత్తంగా ఉండాలని మంత్రులకు ఉద్బోధించారు. చేసిన మంచిని ప్రజలకు వివరించి.. వారి సమ­స్యలు విని.. వాటిని పరిష్కరించి.. ప్రజల ఆశీర్వా­దం పొందడానికి చేపట్టిన బృహత్తర కార్యక్రమమే గడప గడపకూ మన ప్రభుత్వమని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని మీ నియోజకవర్గాల్లో మరింత ప్రభా­వవంతంగా నిర్వహించడంతోపాటు మీ జిల్లా.. మీరు ఇన్‌చార్జ్‌ మంత్రిగా వ్యవహరించే జిల్లాలోనూ ఆ కార్యక్రమాన్ని మరింత ప్రభావ వంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

8వ తరగతి చదవుతున్న పిల్లలకు ఈనెల 21న ట్యాబ్‌లు, బైజూస్‌ ఈ–కంటెంట్‌ను అందజేసే కార్య­క్రమంలో పాల్గొనాలని సూచించారు. అవ్వా­తాత­లకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.2,750కి పెంచు­తున్న తరుణంలో జనవరి 1 నుంచి 7 వరకు నిర్వ­హించే వారోత్సవాల్లో పాల్గొని, పెన్షన్‌ పెంపు మంజూరు పత్రాలను అందజేసి, వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పారు.    

మరిన్ని వార్తలు