విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

5 Mar, 2022 11:12 IST|Sakshi

సాక్షి,విజయనగరం: విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాముకాటుకు గురైన సంగతి తెలిసిందే. పాము కాటేసిన ముగ్గురు విద్యార్థులలో 8 తరగతి చదువుతున్న రంజిత్‌కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

(చదవండి: విషాదం: ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు.. )

మరిన్ని వార్తలు