ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 

31 Aug, 2022 04:20 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి,అమరావతి: వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు. 

మరిన్ని వార్తలు