AP: సీఎం జగన్‌ చేతుల మీదగా బీఫాం అందుకున్న రుహుల్లా 

9 Mar, 2022 12:52 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా బీఫాం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా బీంఫాం అందుకున్నారు. ఇటీవల మరణించిన కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, రుహుల్లా తండ్రి మహ్మద్‌ సలీమ్‌ పాల్గొన్నారు.

చదవండి: సీఎం మాటలు మనో ధైర్యాన్ని నింపాయి

ఈ సందర్భంగా రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ, మూడు నెలల క్రితం అమ్మ కరీమున్నీసా మరణించారని.. సీఎం వైఎస్ జగన్‌ పిలిపించి ఈ రోజు బీఫామ్ ఇచ్చారని తెలిపారు.  రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నానని పేర్కొన్నారు. మైనారిటీలంతా సీఎం జగన్‌కి రుణపడి ఉంటారన్నారు. మేమంతా ఆయనకు అండగా ఉండి ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. తన తల్లి చేసిన అభివృద్ధిని కొనసాగిస్తానని రుహుల్లా అన్నారు.

మరిన్ని వార్తలు