‘గడప గడపకు’పై కీలక భేటీ

18 Jul, 2022 04:03 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సీఎం భేటీ

మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్లడంపై దిశా నిర్దేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి.. అందిస్తున్న సుపరిపాలనను ప్రజలకు చాటి చెప్పి.. ఆశీర్వదించాలని సర్కార్‌ చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఏప్రిల్‌ 11న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా.. ఇంటింటికీ వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలకు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు వస్తున్న స్పందన.. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం తదితరాలను సమీక్షించి, మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమవుతున్నారు.  

మరిన్ని వార్తలు