గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

4 Aug, 2021 17:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో ఈ సాయం‍త్రం మర్యాదపూర్వకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు సీఎం జగన్‌ దంపతులు గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పుట్టినరోజు.. కోవిడ్‌ కారణంగా ఆయన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న విషయం విధితమే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు