హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన సీఎం జగన్‌

22 Sep, 2020 18:45 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఢిల్లీలో మంగళవారం సాయంత్రం కలిశారు. రాష్ట్రాభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. దాదాపు గంటపాటు ఈ భేటీ జరిగినట్టు తెలిసింది. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి ఉన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రోజు  రాత్రి సీఎం జగన్‌ ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం బయల్దేరి నేరుగా తిరుపతి చేరుకుంటారు. అక్కడ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేసి గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
(చదవండి: త్వరలోనే డీఎస్సీ 2020: ఆదిమూలపు సురేశ్‌)

మరిన్ని వార్తలు