కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

10 Jun, 2021 21:10 IST|Sakshi
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం ముగిసింది. గంటకు పైగా అమిత్‌ షాతో చర్చలు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఆయనతో చర్చించారు. గంట 36 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. అంతకుముందు సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, షెకావత్‌లతో పాటు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. సీఎం వైఎస్‌ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు