వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కాలేయ మార్పిడి, బోన్మారో ట్రాన్స్ప్లాంట్ వంటి అత్యాధునిక, ఖరీదైన వైద్యం కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో వర్తింపజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆస్పత్రులను గుర్తించి తగిన వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున్తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రదర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.35 కోట్ల స్మార్ట్ హెల్త్ కార్డులు (క్యూఆర్ కోడ్తో సహా) జారీ చేశామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా హైదరాబాద్లో 77, బెంగళూరులో 26, చెన్నైలో 27 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను గుర్తించామని, వాటిలో 716 చికిత్సలు అందుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రూ.1000 ఖర్చు దాటిన ప్రతి వైద్యం తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో భాగంగా ఆరోగ్య శ్రీ ఆస్పత్రులు, ఎన్ఏబీహెచ్ గుర్తింపు, ఏఎన్ఎంల పాత్ర, టెలిమెడిసిన్ కాల్ సెంటర్ తదితర అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.(చదవండి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్)
ఎన్ఏబీహెచ్ గుర్తింపు
ఏఎన్ఎంల పాత్ర
టెలి మెడిసిన్ కాల్ సెంటర్
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు