అపోలో ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

5 Feb, 2022 16:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'వైద్యరంగంలో ఆధునిక భారత ఆరోగ్య సంరక్షణ రూపశిల్పిగా పరిగణించబడుతున్న ప్రతాప్‌ సి. రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ ఆయన సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు' పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం ట్వీట్‌ చేశారు.

చదవండి: (Anantapur: అనంత గర్భం.. అరుదైన ఖనిజం)​ 

>
మరిన్ని వార్తలు