తలశిల సతీమణి భౌతికకాయానికి సీఎం జగన్‌ దంపతుల నివాళులు

5 Feb, 2023 12:43 IST|Sakshi

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ సతీమణి స్వర్ణకుమారి కన్నుమూయడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తలశిల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ మేరకు సీఎం జగన్‌ దంపతులు ఆదివారం మధ్యాహ్నం గొల్లపూడి బయల్దేరి వెళ్లారు. రఘురాం భార్య స్వర్ణకుమారికి నివాళులు అర్పించి..  తలశిల కుటుంబాన్ని సీఎం జగన్‌ దంపతులు పరామర్శించారు. 

మరిన్ని వార్తలు