తెలుగు భాషను పరిరక్షించుకోవాలి: సీఎం జగన్‌

21 Feb, 2021 19:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
చదవండి: జనం ముందు కత్తులు.. తెర వెనుక పొత్తులు  
ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర

 

మరిన్ని వార్తలు