జ్యోతిరావు పూలే వర్ధంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌

28 Nov, 2021 13:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: సామాజిక అసమానతలను, దురాచారాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గం అని నమ్మిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ‘‘బడుగు, బలహీన వర్గాల హక్కులకోసం పోరాడిన ఉద్యమ కారుడు ఆయ‌న. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి’’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు.


చదవండి: ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్‌ ట్వీట్‌ 

మరిన్ని వార్తలు