రేపు పోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌

13 Jul, 2021 03:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలు ఇదీ.. 

బుధవారం ఉ.10.00 : సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గంలో హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 
10.10: హెలీకాప్టర్‌లో పోలవరానికి ప్రయాణం 
11.00: ప్రాజెక్టు హెలీప్యాడ్‌ వద్దకు చేరిక 
11.10–12.00: క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన 
మ.12.00–1.00: అధికారులతో సమీక్ష సమావేశం 
1.20: హెలీకాప్టర్‌లో తిరుగుపయనం 
2.00: తాడేపల్లిలోని హెలీప్యాడ్‌కు రాక 
2.15: సీఎం నివాసానికి..  

మరిన్ని వార్తలు