CM YS Jagan: ఆసక్తిగా.. ఆరా! 

11 Jan, 2022 03:45 IST|Sakshi

అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించిన సీఎం జగన్‌  

సాక్షి, అమరావతి: తన క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటైన 144 పీఎస్‌ఏ ప్లాంట్ల ప్రారంభం సందర్భంగా దాదాపు 20 రకాలకు పైగా హైఎండ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ పనితీరును సీఎం ఆసక్తిగా పరిశీలించారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనుల్లో పురోగతి, పీఎస్‌ఏ ప్లాంట్ల ఫోటో గ్యాలరీని తిలకించారు.   

చదవండి: Andhra Pradesh: లక్షణంగా ఆరోగ్యం

మరిన్ని వార్తలు