నేడు తాడిపత్రిలో జర్మన్‌ హ్యాంగర్ల ఆస్పత్రి ప్రారంభం

4 Jun, 2021 08:25 IST|Sakshi
ప్రారంభానికి సిద్ధమైన తాత్కాలిక కోవిడ్‌ ఆస్పత్రి

తాడిపత్రి రూరల్‌: రాష్ట్రంలోనే తొలిసారిగా 500 ఆక్సిజన్‌ పడకల జర్మన్‌ హ్యాంగర్ల ఆస్పత్రిని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్‌ స్టీల్‌ వద్ద ఏర్పాటు చేశారు. దీనిని సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఉదయం వర్చువల్‌గా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. ఆస్పత్రి నిర్మాణ టెండర్‌ గడువు రెండు నెలలు అయినా కూడా.. ప్రత్యేక చొరవ తీసుకొని 14 రోజుల్లోనే పూర్తి చేయించినట్లు చెప్పారు. ఇక్కడ ప్రతి బెడ్‌కు ఆక్సిజన్‌ సరఫరా సదుపాయముందని వివరించారు.

చదవండి: వ్యాక్సినేషన్‌ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్‌  
ప్రైవేటు ఆస్పత్రుల నుంచి డబ్బు రిఫండ్‌కు చర్యలు  

మరిన్ని వార్తలు