Merry Christmas 2022: ప్రజలకు సీఎం జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

24 Dec, 2022 18:04 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ప్రజలందరూ క్రిస్మస్‌ పండుగను జరుపుకోనున్నారు. కాగా, క్రిస్మస్‌  సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్‌ జగన్‌.

మరిన్ని వార్తలు