తెలుగు వారికి శోభకృత్‌ నామ ఉగాది శుభాకాంక్షలు: సీఎం జగన్‌

21 Mar, 2023 16:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ప్రజలు ఉగాది పండుగ జరుపుకోంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందస్తుగా తెలిపారు. 

‘షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ.. కొత్త లక్ష్యాలకు, ఆలోచనలకు, ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలి. రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలే జరగాలి. సమృద్ధిగా వానలు కురవాలి.. పంటలు బాగా పండాలి. రైతులకు మేలు జరగాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 


 

మరిన్ని వార్తలు