సోదర భావాన్ని పెంపొందించే పండుగ రక్షా బంధన్‌

3 Aug, 2020 05:45 IST|Sakshi

శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి,అమరావతి: రక్షా బంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సోదర సోదరీమణుల మధ్య బంధాన్ని ప్రతిబింబించే పండుగని పేర్కొన్నారు. మహిళలను రక్షించాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించడం, వారి సంక్షేమం కోరుకోవడమే ఈ పండుగ స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.  

మరిన్ని వార్తలు