AP Global Investors Summit 2023: విశాఖలో సీఎం జగన్‌..

2 Mar, 2023 18:33 IST|Sakshi

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖలో రేపు, ఎల్లుండి(శుక్ర, శనివారాల్లో) జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో  సీఎం జగన్‌ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(గురువారం) సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి విశాఖకు బయల్దేరి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌కు మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌ నుండి రాడిసన్ బ్లూ హోటల్‌కు సీఎం జగన్‌ చేరుకున్నారు. రాత్రికి నగరంలో బస చేస్తారు సీఎం జగన్‌.

3వ తేదీ షెడ్యూల్‌
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. రాత్రి 8.00-9.00 గంటల సమయంలో ఎంజీఎం పార్క్‌ హోటల్‌లో జీఐఎస్‌ డెలిగేట్స్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు.

4వ తేదీ షెడ్యూల్‌
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

చదవండి: AP Global Investors Summit 2023: పెట్టుబడులకు రాచబాట

మరిన్ని వార్తలు