చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవం: కలెక్టర్‌

4 Sep, 2021 21:07 IST|Sakshi

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రాజుపాలెం పాఠశాలలో చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవమని జిల్లా కలెక్టర్‌ అన్నారు. స్కూల్‌ లేని ఆదివారం రోజు ఘటన జరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థి ఆడుకోవడానికి అక్కడకి వెళ్లినట్లు తెలిపారు. ఆ స్కూల్‌ భవనం వినియోగంలోనే లేదన్నారు. నాడు-నేడు కింద ఆ స్కూల్‌ను తీసుకోలేదని కలెక్టర్‌ వెల్లడించారు. పాడైపోయిన భవనాలను గుర్తించి కూల్చివేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. 

చదవండి: పసికందును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ

మరిన్ని వార్తలు