వరదల సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

17 Aug, 2020 13:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర, రాయలసీమ‌ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో  రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం విధించిన కరోనా నియమాలను పాటిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు సహకరించాలని కోరారు. వర్షాలు కురుస్తున్న సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను విడుదల చేశారు.

వరదల సమయంలో..

  • వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
  • మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
  • విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి.
  • ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హూల్స్ను గుర్తించి ఆ ప్రదేశం లొ కనిపించే విదంగా చిహ్నాలు, ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
  • వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయవద్దు, రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు గుర్తుంచుకోండి.
  • తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్/కవర్ తో మూసి ఉంచండి. 
  • వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగాలి.
  • మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడండి. (చదవండి: 19న మరో అల్ప పీడనం: వాతావరణ శాఖ)

వరదల తరువాత..

  •  మీ పిల్లలను నీటిలోకి గాని  మరియు వరద నీటి సమీపంలోకి  ఆడటానికి పంపకండి.
  • దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు, వాటిని తనిఖీ చేయండి.
  • అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్లులను మరియు ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆపివేయండి. తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు.
  • విరిగిన విద్యుత్ స్తంభాలు మరియు తీగలు, పదునైన వస్తువులు మరియు శిధిలాల ను నిశితంగా పరిశీలించండి .
  • వరద నీటిలో కలిసిన ఆహారాన్ని తినవద్దు.
  • మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.
  • వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాముకాటుకు ప్రధమ చికిత్స తెలుసుకోండి.
  • నీటి మార్గాలు / మురుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకండి.
  • నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు. 

మీరు ఖాళీ చేయవలసి వస్తే..

  • మంచం మరియు టేబుళ్లపై మీ ఫర్నిచర్ మరియు ఇతర ఉపకరణాలను పెట్టండి.
  • టాయిలెట్ గిన్నెపై ఇసుక సంచులను ఉంచండి మరియు మురుగునీటి తిరిగిరాకుండా నివారించడానికి అన్ని కాలువ రంధ్రాలను మూసివేయండి 
  • మీ కరెంట్ మరియు గ్యాస్ కనెక్షన్ ను ఆపివేయండి
  • ఎత్తైన భూ ప్రదేశం / సురక్షిత ఆశ్రయానికి వెళ్లండి.
  • మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు మరియు ముఖ్యమైన పత్రాలు లను తీసుకొని వెళ్ళండి.
  • లోతైన, తెలియని జలాల్లోకి ప్రవేశించవద్దు,  నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి.
  • అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళండి. 
  • కుటుంబ సమాచార ప్రణాళికను రూపొందించుకోండి. 
  • తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.
మరిన్ని వార్తలు