ఏపీ: 10,175 పాజిటివ్‌ కేసులు.. 68 మంది మృతి

10 Sep, 2020 17:25 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 72,229 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 10,175 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,37,687కు చేరింది. కొత్తగా 68 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,702 చేరింది. బుధవారం 10,040 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. (వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందర పనికిరాదు)

ఇప్పటి వరకు ఏపీలో  4,35,647  మంది కోలుకున్నారు. ప్రస్తుతం 97,338 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 43,80,991 కోవిడ్‌ టెస్టులు చేశారు. కరోనా కారణంగా నిన్న చిత్తూరులో 9, కడపలో 9, నెల్లూరులో 9, ప్రకాశంలో 7, కృష్ణాలో 7, అనంతపూరంలో 6,  తూర్పు గోదావరిలో 5, పశ్చిమగోదావరిలో 5,  శ్రీకాకుళంలో 4, కర్నూలులో 5, విశాఖపట్నంలో 4, గుంటూరులో 2, విజయనగరంలో 1 చొప్పున మరణించారు.  (43 లక్షలు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు)

మరిన్ని వార్తలు