ఏపీలో పాజిటివ్‌ కేసుల కంటే డిశ్చార్జ్‌లే ఎక్కువ

7 Nov, 2020 17:14 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీలో 24 గంటల్లో 80,082 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,367 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,38,363కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కొత్తగా 2,747 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,12,517గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,779కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 21,434 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 85,87,312 మందికి సాంపిల్స్‌ పరీక్షించడం జరిగింది.  ('కరోనా‌ తర్వాత ప్రపంచం భిన్నంగా')

మరిన్ని వార్తలు