సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజా గణాంకాల ప్రకారం.. వారం రోజులుగా 10 వేల కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో రోజూ 10 వేలకు తగ్గకుండా కేసులు నమోదయ్యేవి. అలాంటిది ఇప్పుడు కాస్త తగ్గుదల కనిపిస్తోంది. సగటున రోజుకు 70 వేల టెస్టులు జరుగుతున్నాయి. తాజాగా 70,455 టెస్టులు చేయగా.. 7,738 మందికి పాజిటివ్గా తేలింది. అయితే, కోలుకున్న వారి సంఖ్య 10,608గా ఉండడంతో.. పాజిటివ్ల కంటే రికవరీ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో 57 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 51,04,131 టెస్టులు చేయగా, 6,25,514 మందికి పాజిటివ్గా తేలింది. వీరిలో 5,41,319 మందికోలుకోగా, 78,836మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 5,359కి చేరింది. దేశంలోనే అత్యధికంగా.. ఏపీలో సగటున 10 లక్షల జనాభాకు 95,583 టెస్టులు చేస్తున్నారు.