సాక్షి, కృష్ణా జిల్లా: పెడనలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10 రోజుల క్రితం భార్యభర్తలు ప్రసాద్, భారతికి కరోనా పాజిటివ్గా తేలింది. వారు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారు. కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో మనస్తాపానికి గురైన దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.