రాష్ట్రంలో 3,263 మందికి కరోనా పాజిటివ్

13 Apr, 2021 05:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,263 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 33,755 టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,54,63,146 మందికి కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా.. 9,28,664 మందికి కరోనా సోకింది. ఒక్కరోజులో 1,091 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,98,238కి చేరింది. మరోవైపు కరోనా వల్ల ఒకే రోజు 11 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,311కి చేరింది. సోమవారం అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 654 కేసులు నమోదయ్యాయి.   

మరిన్ని వార్తలు