54.47 లక్షలు దాటిన పరీక్షలు 

26 Sep, 2020 04:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకు 54.47 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 69,429 మందికి పరీక్షలు చేయగా 7,073 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. 8,695 మంది కోలుకుని డిశ్చార్జి కాగా 48 మంది కోవిడ్‌తో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 54,47,796 టెస్టులు చేయగా 6,61,458 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఇప్పటివరకూ 5,88,169 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 67,683 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 5,606 మంది కోవిడ్‌ కారణంగా మృతి చెందగా, మిలియన్‌ జనాభాకు 1,02,019 టెస్టులు నిర్వహించారు.   

మరిన్ని వార్తలు