ఒకే రోజు 80 వేలకు పైగా కోవిడ్‌ పరీక్షలు

24 Oct, 2020 04:36 IST|Sakshi

3,765 మందికి పాజిటివ్

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 80,238 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా వచ్చినప్పట్నుంచి ఇదే ఆల్‌టైమ్‌ రికార్డ్‌. ఇన్ని పరీక్షలు చేసినా శుక్రవారం నమోదైన పాజిటివ్‌ కేసులు 3,765. ఇప్పటి వరకు 74,28,014 పరీక్షలు చేయగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,00,684కి చేరింది. ఒకే రోజు 4,281 మంది కోలుకోగా ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 7,62,419కి చేరింది. తాజాగా 20 మంది మృతితో మొత్తం మరణాలు 6,544కి చేరాయి. యాక్టివ్‌ కేసులు ఇంకా 31,721 ఉన్నాయి. మిలియన్‌ జనాభాకు 1,39,101 మందికి పరీక్షలు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు